కెప్టెన్సీ బాధ్యతలపై అజింక్య హర్షం... 1 y ago
ఐపీఎల్ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ గా రంగంలోకి రానుంది. రూ.1.50 కోట్లకు దక్కించుకున్న సీనియర్ ఆటగాడు అజింక్య రహానెకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. తనకు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై రహానె సంతోషం వ్యక్తంచేశాడు. కేకేఆర్ కు కెప్టెన్గా ఉండటం తనకు గర్వకారణమని పేర్కొన్నాడు. ఈ అద్భుతమైన ఫ్రాంఛైజీకి కెప్టెన్ గా ఉండటం నాకు అందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని రహానె తెలిపాడు.